Janardhanreddy32

Apr 23 2024, 12:22

* BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్*

ఈరోజు BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహ రెడ్డి గారు నల్లమోతు భాస్కర్ రావు గారు MLC MC కోటిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి గారుతదితరులు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 22 2024, 21:59

ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన *నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, బత్తుల ల
ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన *నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు* గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు *కుందూరు రఘువీర్ రెడ్డి గారిని* దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు... మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు..

Janardhanreddy32

Apr 22 2024, 20:03

*ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ

వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 22 2024, 19:53

*పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*


 వములపల్లి ఏప్రిల్ 22: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఓ సైనికుని వలె పని చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి నర్సింగ్ వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ పార్లమెంట్ ఇంచార్జిగా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ వెంకటేశ్వర్లును రాష్ట్ర నాయకత్వం నియమించడంతో

సోమవారం మండల కేంద్రంలో వేములపల్లి మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పుట్టల (కొమ్ము) వెంకన్న, మండల కాంగ్రేస్ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశంలో ఇటు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందాయన్నారు. భాజపా, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని వీరిపాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. మరోసారి వీరి మాయమాటలకు

Janardhanreddy32

Apr 17 2024, 18:51

మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న రఘువీరన్న దంపతులు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రెడ్డి కాలనీ రామాలయంలో దేశిడి శేఖర్ రెడ్డి కౌన్సిలర్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న రఘువీరన్న దంపతులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ బోర్డ్ కౌన్సిలర్ రవి నాయక్ ,రెడ్డి కాలనీవాసులు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 17 2024, 18:45

బ్రేకింగ్ : రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోద:

నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు.

సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

Janardhanreddy32

Apr 14 2024, 14:30

మిర్యాలగూడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఘనంగా నిర్వహించినారు.


ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత పని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి ధీరావత్ లింగా నాయక్ వల్లభట్ల వెంకన్న నాగయ్య ఎస్కే అస్గర్ జానయ్య శ్రీనివాసరాజు ఎంఏ ఆఫీస్ సమయం తదితరులు పాల్గొన్నారు

Janardhanreddy32

Apr 14 2024, 12:48

నేడు రాజ్యాంగ నిర్మాత , భారత రత్న *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి*. 133వ జయంతి :

మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప నాయకుడు, విద్యావేత్త .. వెనుకబడిన వర్గాలు అభివృద్ది చెందాలని అంటే అది ఒక విద్య తోనే సాధ్యం కాబట్టి వెనుక బడిన, బడుగు బలహీనర్గాల యువత విద్యలో ముందంజలో ఉంటూ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

Janardhanreddy32

Apr 11 2024, 14:05

స్వర్గీయులు *దండ శ్రీనివాస్ రెడ్డి గారి* *18వ వర్ధంతి

లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ NSUI నాయకుడిగా దండ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శనీయం అని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 11 2024, 13:47

మిర్యాలగూడ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతిని రాఘవ థియేటర్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్

భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపటానికి జ్యోతిరావు పూలే గారు అహర్నిశలు కృషిచేసి సామాజిక సంఘ కర్తగా ఆ రోజులలో మహిళలు విద్యాభివృద్ధికి దూరంగా ఉన్న రోజులలో మహిళలు అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి వారికి విద్యాబోధన చేసేవారు జ్యోతిరావు పూలే గారు ఆనాడు హరిజనవాడలో ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటూ అంటరానితనానికి రూపుమాపే విధంగా కృషి చేసేవారు.

ఇప్పుడున్న యువతరం జ్యోతిరావు గారి పూలే వారి ఆశయాలను పునికి పుచ్చుకొని ముందుకు సాగాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి దీరావత్ లింగ నాయక్ ఏఐటిసి నాయకులు వలపట్ల వెంకన్న పట్టేటి వెంకన్న గోనగంటి జానయ్య రహిమాన్ శ్రీనివాసరాజు పేరుపొంగు నాగయ్య తదితరులు పాల్గొన్నారు